ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- May 27, 2026
కువైట్: ఈద్ అల్-అధా సందర్భంగా కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి, కువైట్ అమీర్, యువరాజు, ప్రభుత్వం మరియు అక్కడి స్నేహపూర్వక ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు.
ఈద్ అల్-అధా విశ్వాసం, త్యాగం, కరుణ మరియు ఉదారతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇది మానవత్వం, ఐక్యత, ఉదారత మరియు పరస్పర గౌరవం వంటి బంధాలను బలోపేతం చేయడానికి మనకు స్ఫూర్తినిస్తుందన్నారు.
ఈ పండుగను భారతదేశంలో ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆత్మీయతతో జరుపుకుంటారని తెలియజేశారు. కుటుంబాలు ప్రత్యేక ప్రార్థనల కోసం ఒకచోట చేరి, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పండుగ భోజనాలను పంచుకుంటూ, అభాగ్యులకు దానధర్మాలు చేస్తూ సామరస్యం, ఐక్యత మరియు సాంస్కృతిక వైవిధ్యం వంటి గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు.
కువైట్లోని 10 లక్షలకు పైగా ఉన్న భారతీయ సమాజానికి సోదరభావంతో కూడిన మద్దతును అందించినందుకు కువైట్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కువైట్ మరియు భారత ప్రజల మధ్య ఉన్న సంబంధాలు సహజీవనం మరియు సహకారానికి ఒక విశిష్ట నమూనాగా నిలుస్తున్నాయని అన్నారు. రెండు మిత్ర దేశాలు మరియు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి కొనసాగించాలని ఆశిస్తున్నట్టు తన ప్రకటనలో భారత రాయబారి పరామిత త్రిపాఠి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









