న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు

- May 28, 2026 , by Maagulf
న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు

శివరాజ్ సింగ్ చౌహాన్ రచనకు విశేష స్పందన

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన ‘అప్నాపన్’ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ,ఏపీ మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ‘అప్నాపన్’ పుస్తకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఉన్న సన్నిహిత అనుబంధాన్ని మాత్రమే కాకుండా, సంస్థాగత నిర్మాణం, నాయకత్వ లక్షణాలు, పరిపాలన, మహిళా సాధికారత మరియు దేశసేవ వంటి కీలక అంశాలపై లోతైన అవగాహనను అందిస్తుందని పేర్కొన్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయ జీవిత అనుభవాలు, ప్రజాసేవ పట్ల ఆయన దృక్పథం ఈ పుస్తకంలో ప్రతిబింబించాయని తెలిపారు. ముఖ్యంగా దేశాభివృద్ధి, రైతు సంక్షేమం మరియు సేవా భావం పట్ల ఆయన ఆలోచనలను ఈ గ్రంథం ద్వారా తెలుసుకునే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు, పార్టీ నాయకులు మరియు అభిమానులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com