న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- May 28, 2026
శివరాజ్ సింగ్ చౌహాన్ రచనకు విశేష స్పందన
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన ‘అప్నాపన్’ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ,ఏపీ మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ‘అప్నాపన్’ పుస్తకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శివరాజ్ సింగ్ చౌహాన్కు ఉన్న సన్నిహిత అనుబంధాన్ని మాత్రమే కాకుండా, సంస్థాగత నిర్మాణం, నాయకత్వ లక్షణాలు, పరిపాలన, మహిళా సాధికారత మరియు దేశసేవ వంటి కీలక అంశాలపై లోతైన అవగాహనను అందిస్తుందని పేర్కొన్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయ జీవిత అనుభవాలు, ప్రజాసేవ పట్ల ఆయన దృక్పథం ఈ పుస్తకంలో ప్రతిబింబించాయని తెలిపారు. ముఖ్యంగా దేశాభివృద్ధి, రైతు సంక్షేమం మరియు సేవా భావం పట్ల ఆయన ఆలోచనలను ఈ గ్రంథం ద్వారా తెలుసుకునే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమానికి రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు, పార్టీ నాయకులు మరియు అభిమానులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!







