మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- July 14, 2026
మస్కట్: మిడిలీస్టులో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేయడంతో పాటు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 2026 డెలివరీకి ఒమాన్ ముడి చమురు అధికారిక ధర సోమవారం బ్యారెల్కు 72.11 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. గత శుక్రవారం నమోదైన 69.29 డాలర్లతో పోలిస్తే 2.82 డాలర్లు పెరిగింది. గత నెల కుదిరిన తాత్కాలిక అమెరికా–ఇరాన్ ఒప్పందం భవిష్యత్తుపై తాజా పరిణామాలు అనిశ్చితిని పెంచుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బంగారం ధరలు పతనం మరోవైపు, ఆసియా మార్కెట్లలో సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో బంగారం ధరలు ఒక శాతానికి పైగా తగ్గాయి. హోర్ముజ్ జలసంధి మూసివేతపై ఆందోళనలతో చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరిగింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 4,072.78 డాలర్లకు పడిపోగా, ఆగస్టు డెలివరీకి అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 4,081.70 డాలర్లకు తగ్గాయి. అదేవిధంగా స్పాట్ సిల్వర్ ధర ఔన్స్కు 58.89 డాలర్లకు, ప్లాటినం 1,610.22 డాలర్లకు, పల్లాడియం 1,260.15 డాలర్లకు తగ్గాయి. ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కాంగ్రెస్లో ఇవ్వనున్న అర్ధవార్షిక నివేదికతో పాటు, వినియోగదారుల ధరల సూచీ (CPI), ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI), జూన్ రిటైల్ అమ్మకాల గణాంకాలపై అంతర్జాతీయ మార్కెట్లు దృష్టి సారించాయి
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







