ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- May 28, 2026
హైదరాబాద్: తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, నటుడిగా, ప్రజా నాయకుడిగా చరిత్ర సృష్టించిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) (NTR) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు మరియు వేలాది మంది అభిమానులు ఘాట్ వద్దకు చేరుకుని ఆయనకు ఘన నివాళులర్పించారు.
తాతకు శ్రద్ధాంజలి ఘటించిన జూనియర్ ఎన్టీఆర్
నందమూరి వారసుడు, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఉదయాన్నే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించారు. తన తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి భావోద్వేగంతో అంజలి ఘటించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం ఎప్పటికీ చెరగనిదని, ఆయన చేసిన సేవలు తరతరాలకూ గుర్తుంటాయని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఘాట్ పరిసరాల్లో అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కుమార్తె, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “రామారావు గారిది మరణం లేని జననం. తెలుగుజాతి ఉన్నంత వరకు ఆయన చిరంజీవిగానే ప్రజల గుండెల్లో ఉంటారు. ఒక తిరుగులేని కథానాయకుడిగానే కాకుండా, ప్రజాసేవలో ఆయన తనదైన ముద్ర వేశారు.
తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్–ఒక ప్రభంజనం
‘NTR’ అనే ఈ మూడు అక్షరాలు కేవలం ఒక పేరు కాదు.. అదొక ప్రభంజనం, ఒక సంచలనం. సినీ వినీలాకాశంలో దేవుడిగా గుర్తింపు తెచ్చుకుని, రాజకీయాల్లోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే అధికార పీఠాన్ని దక్కించుకున్న చరిత్ర ఆయనది. తెలుగు సమాజంలో పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తెలుగువారి గుండెల్లో నిత్యం స్ఫూర్తి రగిలిస్తూనే ఉన్నారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!









