దుబాయ్‌లో ఘనంగా మహానాడు వేడుకలు

- May 29, 2026 , by Maagulf
దుబాయ్‌లో ఘనంగా మహానాడు వేడుకలు

దుబాయ్: మహానాడు సందర్భంగా దుబాయ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలు, గుర్తులతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని తెలుగుదేశం పార్టీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలుగు జాతి గౌరవం, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో *యూఏఈ టీడీపీ అధ్యక్షులు మోతుకూరి విశ్వేశ్వరరావు, కోడి రాజా రవి కిరణ్, ప్రసాదు దారాపనేని, సునీల్ బోయపాటి, వర ప్రసాద్ కందిబేడల(సౌదీ), మధుసూదన్ తాళ్లూరి, శివ, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు* తదితరులు పాల్గొన్నారు.

మహానాడు స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారు మరింత ఐక్యంగా ముందుకు సాగాలని, తెలుగు ప్రజల అభ్యున్నతి మరియు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తమవంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com