దుబాయ్లో ఘనంగా మహానాడు వేడుకలు
- May 29, 2026
దుబాయ్: మహానాడు సందర్భంగా దుబాయ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలు, గుర్తులతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని తెలుగుదేశం పార్టీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలుగు జాతి గౌరవం, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో *యూఏఈ టీడీపీ అధ్యక్షులు మోతుకూరి విశ్వేశ్వరరావు, కోడి రాజా రవి కిరణ్, ప్రసాదు దారాపనేని, సునీల్ బోయపాటి, వర ప్రసాద్ కందిబేడల(సౌదీ), మధుసూదన్ తాళ్లూరి, శివ, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు* తదితరులు పాల్గొన్నారు.
మహానాడు స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారు మరింత ఐక్యంగా ముందుకు సాగాలని, తెలుగు ప్రజల అభ్యున్నతి మరియు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తమవంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- ఇక NIMSలో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!
- దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- థియేటర్లలో ఫైర్ ఫోర్స్ సేఫ్టీ తనిఖీలు..!!
- నిజాయితిని చాటిన భారత ప్రవాసుడు.. Dh100,000 అప్పగింత..!!
- ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!









