దిల్ రాజు 'శతమానం భవతి'

- August 09, 2016 , by Maagulf
దిల్ రాజు 'శతమానం భవతి'

శర్వానంద్‌, అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలలో సతీష్‌ వేగేశ్న తెరకెక్కిస్తున్న చిత్రం 'శతమానం భవతి'. సక్సెస్‌పుల్‌ నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతుంది.ఈ చిత్రం తాత, మనవడుల మధ్య ఉన్న బాండింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. 2006లో ఇదే రోజు దిల్ రాజు బ్యానర్ పై వచ్చిన బొమ్మరిల్లు ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సిద్ధార్ద్ తండ్రి కొడుకులుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయింది. 10 సంవత్సరాల తర్వాత దిల్ రాజు మరోసారి అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు. 2017 సంక్రాంతికి ఈ శతమానం భవతి చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజు,జయ సుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేశారు. మరి దానిపై మీరు ఓ లుక్కేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com