ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- June 02, 2026
దోహా: ఖతార్ లో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన మూడు ప్రముఖ ఫుడ్ కోర్టులను ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. మున్సిపల్ ఆరోగ్య నియంత్రణ బృందాలు నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అధికారులు సీజ్ చేసిన సంస్థలలో 'కెఫెటేరియా అల్ నైమి' (మూడు రోజుల పాటు మూసివేత), 'పారిస్ హైపర్మార్కెట్ బుచరీ' ( 45 రోజుల పాక్షిక మూసివేత), 'షై ఎక్స్ప్రెస్ రెస్టారెంట్' (15 రోజుల పాటు మూసివేత) ఉన్నాయి. ఈ సంస్థలు ప్రజా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేని పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేస్తున్నాయని, అలాగే ఖతార్ ఆహార నియంత్రణ చట్టాల కింద నిర్దేశించిన ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని మంత్రిత్వశాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావం: గవర్నర్ శుక్లా
- అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం









