అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- June 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో మే నెలకు సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి మొత్తం 160 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక సంస్థ (నజాహా) తెలిపింది. దేశవ్యాప్తంగా 2,365 తనిఖీ పర్యటనలను నిర్వహించినట్లు పేర్కొంది. అలాగే, హజ్ సీజన్ సందర్భంగా పవిత్ర స్థలాలు మరియు సేవా కేంద్రాలలో సుమారు 15వేల తనిఖీ పర్యటనలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ తనిఖీలలో 480 మంది ఉద్యోగులకు సంబంధించిన అనుమానిత కేసులపై దర్యాప్తు జరిపి, 160 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది.
అరెస్టు అయిన వారిలో మున్సిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్ వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతో పాటు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీకి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని వెల్లడించింది. వీరిపై లంచం తీసుకోవడం మరియు తమ అధికారిక హోదాలను దుర్వినియోగం చేయడం వంటి కేసులను నమోదు చేసినట్టు అవినీతి నిరోధక సంస్థ (నజాహా) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







