అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- June 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో మే నెలకు సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి మొత్తం 160 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక సంస్థ (నజాహా) తెలిపింది. దేశవ్యాప్తంగా 2,365 తనిఖీ పర్యటనలను నిర్వహించినట్లు పేర్కొంది. అలాగే, హజ్ సీజన్ సందర్భంగా పవిత్ర స్థలాలు మరియు సేవా కేంద్రాలలో సుమారు 15వేల తనిఖీ పర్యటనలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ తనిఖీలలో 480 మంది ఉద్యోగులకు సంబంధించిన అనుమానిత కేసులపై దర్యాప్తు జరిపి, 160 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది.
అరెస్టు అయిన వారిలో మున్సిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్ వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతో పాటు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీకి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని వెల్లడించింది. వీరిపై లంచం తీసుకోవడం మరియు తమ అధికారిక హోదాలను దుర్వినియోగం చేయడం వంటి కేసులను నమోదు చేసినట్టు అవినీతి నిరోధక సంస్థ (నజాహా) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







