అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- June 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో మే నెలకు సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి మొత్తం 160 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక సంస్థ (నజాహా) తెలిపింది. దేశవ్యాప్తంగా 2,365 తనిఖీ పర్యటనలను నిర్వహించినట్లు పేర్కొంది. అలాగే, హజ్ సీజన్ సందర్భంగా పవిత్ర స్థలాలు మరియు సేవా కేంద్రాలలో సుమారు 15వేల తనిఖీ పర్యటనలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ తనిఖీలలో 480 మంది ఉద్యోగులకు సంబంధించిన అనుమానిత కేసులపై దర్యాప్తు జరిపి, 160 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది.
అరెస్టు అయిన వారిలో మున్సిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్ వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతో పాటు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీకి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని వెల్లడించింది. వీరిపై లంచం తీసుకోవడం మరియు తమ అధికారిక హోదాలను దుర్వినియోగం చేయడం వంటి కేసులను నమోదు చేసినట్టు అవినీతి నిరోధక సంస్థ (నజాహా) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావం: గవర్నర్ శుక్లా
- అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం









