ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- June 03, 2026
కువైట్: మిస్సైల్, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రజలకు కువైట్ సైన్యం కీలక సూచనలు చేసింది. వివిధ ప్రాంతాల్లో వినిపించే పేలుడు శబ్దాల పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని, సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలని కోరింది. ఈమేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-అత్వాన్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.
కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకున్న నేపథ్యంలో కింద పడిన ఏవైనా శిథిలాలు, శకలాలు లేదా గుర్తించలేని వస్తువులకు దూరంగా ఉండాలని, వాటిని తాకే ప్రయత్నం చేయవద్దని పౌరులను మరియు నివాసితులను హెచ్చరించారు. అటువంటివి భద్రతకు ప్రమాదం కలిగించగలవని, అలాంటి వాటిని గుర్తిస్తే వెంటనే అత్యవసర హాట్లైన్ నెంబర్ 112కు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సంస్థలకు సహకరించాలని, భద్రతా ఆదేశాలను పాటించాలని కువైట్ సైన్యం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







