ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- June 03, 2026
కువైట్: మిస్సైల్, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రజలకు కువైట్ సైన్యం కీలక సూచనలు చేసింది. వివిధ ప్రాంతాల్లో వినిపించే పేలుడు శబ్దాల పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని, సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలని కోరింది. ఈమేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-అత్వాన్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.
కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకున్న నేపథ్యంలో కింద పడిన ఏవైనా శిథిలాలు, శకలాలు లేదా గుర్తించలేని వస్తువులకు దూరంగా ఉండాలని, వాటిని తాకే ప్రయత్నం చేయవద్దని పౌరులను మరియు నివాసితులను హెచ్చరించారు. అటువంటివి భద్రతకు ప్రమాదం కలిగించగలవని, అలాంటి వాటిని గుర్తిస్తే వెంటనే అత్యవసర హాట్లైన్ నెంబర్ 112కు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సంస్థలకు సహకరించాలని, భద్రతా ఆదేశాలను పాటించాలని కువైట్ సైన్యం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









