ఆడియో వేడుకకు రంగం సిద్ధం
- August 09, 2016
యంగ్ టైగర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. దీనిని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ రోజుకో పోస్టర్ ని విడుదల చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ క్రమంలోనే "జనతా గ్యారేజ్"కు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ ని విడుదల చేసింది.
సమంత వెనుక జూనియర్ ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ వెనుక నిత్యా మీనన్ పరిగెడుతున్న ఈ పోస్టర్ ఉద్దేశం. బ్లాక్ బాస్టర్ అందుకోవడానికి రెట్టించిన ఉత్సాహంతో ఈ ముగ్గురూ పరుగులు పెడుతున్నట్లుగా ఉందని అభిమానులు కీర్తిస్తున్నారు. ఇటీవల కేరళలో చిత్రీకరణ జరిపిన పాట సందర్భంలోనిది ఈ స్టిల్. ఇప్పటివరకు మాస్ ని ఆకట్టుకునే పోస్టర్స్ ని మాత్రమే విడుదల చేసిన చిత్ర యూనిట్, ఈ పోస్టర్ తో క్లాస్ ని కూడా ఆకర్షించే పనిలో పడింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







