ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- June 06, 2026
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ వైమానిక చర్యలకు గట్టి కౌంటర్ ఇస్తూ అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంపై మరోసారి విరుచుకుపడింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిధిలో ప్రాంతీయ నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నాలుగు ప్రమాదకరమైన దాడి డ్రోన్లను లాంచ్ చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఈ ముప్పును ముందే పసిగట్టిన అమెరికా వైమానిక దళం ఆ నాలుగు డ్రోన్లను గాల్లోనే విజయవంతంగా కూల్చివేసింది. అంతటితో ఆగకుండా, భవిష్యత్తులో ఇరాన్ నుంచి ఎదురయ్యే నిఘా ముప్పును తిప్పికొట్టేందుకు రక్షణ చర్యల్లో భాగంగా గోరుక్ (Goruk) మరియు క్వెర్మ్ ఐలాండ్ (Qeshm Island) తీర ప్రాంతాల్లో ఉన్న ఇరాన్ కోస్టల్ నిఘా రాడార్ సైట్లపై అమెరికా క్షిపణులతో ఎయిర్ స్ట్రైక్స్ జరిపి, వాటిని ధ్వంసం చేసింది.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో వణుకు
ఈ తాజా వైమానిక దాడులు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు చమురు, సహజ వాయువుల రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి సమీపంలో ఈ ఘర్షణలు జరగడం వల్ల గ్లోబల్ ఎనర్జీ సప్లై గొలుసుకు తీవ్ర ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం వల్ల ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండగా, తాజా దాడులు అంతర్జాతీయ మార్కెట్లను మరింత గందరగోళంలోకి నెట్టేలా ఉన్నాయి. ఒకవైపు శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమెరికా-ఇరాన్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతీకార దాడుల పరంపర ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..









