ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- June 07, 2026
మస్కట్: ఒమన్ పౌరులకు ఉచిత పర్యాటక వీసాలను మంజూరు చేయాలని శ్రీలంక (డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక) నిర్ణయించింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) విధానం ద్వారా ఒమన్ పౌరులు శ్రీలంకలో గరిష్టంగా 30 రోజుల పాటు పర్యటించడానికి అనుమతిస్తారు. ఆ అనుమతి కాలపరిమితిలో ప్రయాణికులు శ్రీలంకలోకి రెండుసార్లు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అనుమతించిన గడువు కంటే ఎక్కువ కాలం ఉండాలనుకునే పర్యాటకులు, వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకుని, తగిన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.
శ్రీలంకకు ప్రయాణించాలనుకునే ఒమన్ పౌరులు, తమ పాస్పోర్ట్లు శ్రీలంకలో ప్రవేశించే తేదీ నుండి కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే, ఆరోగ్య బీమా (health insurance) కవరేజీని కలిగి ఉండాలని ప్రయాణికులకు సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









