ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!

- June 07, 2026 , by Maagulf
ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!

మస్కట్: ఒమన్ పౌరులకు ఉచిత పర్యాటక వీసాలను మంజూరు చేయాలని శ్రీలంక (డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక) నిర్ణయించింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) విధానం ద్వారా ఒమన్ పౌరులు శ్రీలంకలో గరిష్టంగా 30 రోజుల పాటు పర్యటించడానికి అనుమతిస్తారు. ఆ అనుమతి కాలపరిమితిలో ప్రయాణికులు శ్రీలంకలోకి రెండుసార్లు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అనుమతించిన గడువు కంటే ఎక్కువ కాలం ఉండాలనుకునే పర్యాటకులు, వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకుని, తగిన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. 

శ్రీలంకకు ప్రయాణించాలనుకునే ఒమన్ పౌరులు, తమ పాస్‌పోర్ట్‌లు శ్రీలంకలో ప్రవేశించే తేదీ నుండి కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే, ఆరోగ్య బీమా (health insurance) కవరేజీని కలిగి ఉండాలని ప్రయాణికులకు సూచించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com