నిర్మాతగా నాగచైతన్య..కీలక పాత్రలో కనిపించనున్న భూమిక చావ్లా
- June 09, 2026
అక్కినేని నాగచైతన్య కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దూత-2 పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎనిమిదేళ్ల తర్వాత క్రేజీ కాంబో!
ఈ సిరీస్ ద్వారా నాగచైతన్య సరికొత్తగా నిర్మాత అవతారమెత్తడం విశేషం. చైతన్య స్వయంగా నిర్మిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సెకండ్ సీజన్కు కూడా ఫస్ట్ సీజన్ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్ను కూడా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్తో తెరకెక్కిస్తున్నారు.
ఫస్ట్ సీజన్లో కీలక పాత్రల్లో మెరిసిన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈసారి కూడా అలరించనున్నారు. అయితే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్రముఖ నటి భూమిక చావ్లా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. గతంలో నాగచైతన్య, భూమిక కలిసి ‘సవ్యసాచి’ (2018) చిత్రంలో నటించారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు









