నిర్మాతగా నాగచైతన్య..కీలక పాత్రలో కనిపించనున్న భూమిక చావ్లా
- June 09, 2026
అక్కినేని నాగచైతన్య కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దూత-2 పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎనిమిదేళ్ల తర్వాత క్రేజీ కాంబో!
ఈ సిరీస్ ద్వారా నాగచైతన్య సరికొత్తగా నిర్మాత అవతారమెత్తడం విశేషం. చైతన్య స్వయంగా నిర్మిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సెకండ్ సీజన్కు కూడా ఫస్ట్ సీజన్ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్ను కూడా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్తో తెరకెక్కిస్తున్నారు.
ఫస్ట్ సీజన్లో కీలక పాత్రల్లో మెరిసిన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈసారి కూడా అలరించనున్నారు. అయితే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్రముఖ నటి భూమిక చావ్లా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. గతంలో నాగచైతన్య, భూమిక కలిసి ‘సవ్యసాచి’ (2018) చిత్రంలో నటించారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







