'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు...జూన్ 12న రిలీజ్
- June 09, 2026
చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమా విడుదల అనేది ఒక ముగింపు ఘట్టం. అయితే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, క్రియేటివ్ ఫిల్మ్మేకర్ నాగ్ అశ్విన్ లకు మాత్రం తాము ఊహించిన ప్రతి క్రియేటివ్ ఎలిమెంట్ తెర పై అత్యుత్తమంగా ఆవిష్కృతమయ్యేలా చూసుకోవడమే ముఖ్యం.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సింగ్ గీతం’ చిత్రం తొలుత జూన్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. కథలో కీలక పాత్ర పోషించే కొన్ని ముఖ్యమైన సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
‘సింగ్ గీతం’ ఒక ఫాంటసీ, సూపర్నేచురల్ ప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రం. ఇందులో సంగీతంతో పాటు విజువల్స్ కూడా కథనంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులను ఆ ప్రపంచంలో పూర్తిగా లీనం చేసే అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో, చిత్ర బృందం ఫైనల్ అవుట్పుట్ను మరింత పర్ఫెక్ట్ చేయడానికి అదనపు సమయం కేటాయిస్తోంది. థియేటర్లలోకి తొందరపడి తీసుకురావడం కంటే అత్యుత్తమ నాణ్యతతో అందించాలనే ఆలోచనతోనే ఈ ఒకరోజు వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ‘సింగ్ గీతం’కు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ లభించింది. అందరూ ఫ్యామిలీతో కలసి బిగ్ స్క్రీన్పై ఆస్వాదించదగిన అద్భుతమైన అనుభూతిని అందించేందుకు జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం మెయిన్ హైలెట్స్ గా నిలవనున్నాయి.
ఇప్పటివరకు విడుదలైన పాటలు, టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచాయి. విభిన్నమైన కాన్సెప్ట్, సింగీతం శ్రీనివాసరావు మార్క్ సృజనాత్మకత, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసి ‘సింగ్ గీతం’ ను ఈ ఏడాది అత్యంత ప్రత్యేకమైన చిత్రాలలో ఒకటిగా నిలబెడుతున్నాయి.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







