తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్

- June 09, 2026 , by Maagulf
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన పి.వి.నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ డా.ఎన్.వి.సుధా కిరణ్ మంగళవారం తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్ లోని లోక్ భవన్‌లో జరిగిన ఈ భేటీలో ట్రస్ట్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా మరియు ప్రజా సేవా రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాల పై గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.

గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించి, సమాజ అభ్యున్నతికి ఇలాంటి సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నట్లు తెలిసింది.

ఈ సమావేశంలో ట్రస్ట్‌కు చెందిన ఇతర సభ్యులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com