యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- June 15, 2026
రియాద్: రియాద్లోని జీసీసీ జనరల్ సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ను జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి ప్రారంభించారు. గల్ఫ్ దేశాల మధ్య న్యాయ నైపుణ్యాల మార్పిడిని మెరుగుపరచడం, శాసనపరమైన సమన్వయం మరియు ఇంటిగ్రేషన్ ను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక వ్యూహాత్మక వేదికగా ఇది సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం, ఈ వేదిక 24,700కు పైగా చట్టపరమైన మరియు శాసనపరమైన పత్రాలను కలిగి ఉందన్నారు. అధునాతన శోధన సామర్థ్యాలను అందిస్తుందని, ఈ ఫీచర్లు సభ్య దేశాలలోని ప్రభుత్వ మరియు న్యాయ సంస్థలతో పాటు శాసన వ్యవహారాలపై ఆసక్తి ఉన్న నిపుణులు, పరిశోధకులు మరియు వ్యక్తులకు ప్రయోజనం పొందడానికి వీలు కల్పిస్తుందన్నారు.
జాతీయ శాసనాల కోసం ఉద్దేశించిన ఈ ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ మొదటి దశలో బహ్రెయిన్ మరియు ఒమన్ దేశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, జనరల్ సెక్రటేరియట్లోని సంబంధిత అధికారులు తదుపరి దశలలో మిగిలిన సభ్య దేశాలతో ఇంటిగ్రేషన్ ను పూర్తి చేయడానికి ప్రయత్నాలను కొనసాగుతున్నాయని జీసీసీ సెక్రటరీ జనరల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









