సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్‌దేవ్

- June 19, 2026 , by Maagulf
సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్‌దేవ్

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని యోగా గురువు బాబా రామ్‌దేవ్, పతంజలి సంస్థ అధినేత ఆచార్య బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాల పై వారు చర్చించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించనున్న యోగా దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లు, ప్రజల భాగస్వామ్యం, యోగా ప్రాముఖ్యతను మరింత విస్తృతంగా చాటిచెప్పే చర్యలపై ముఖ్యమంత్రి వారితో చర్చించినట్లు సమాచారం.

యోగా ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి వారికి వివరించారు.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగినట్లు అధికారులు తెలిపారు. యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వారు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com