ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- June 23, 2026
దోహా: ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) లుసైల్ ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. నెట్వర్క్ అంతటా ముఖ్యమైన అభివృద్ధి పనులను చేయడానికి వీలుగా జూన్ 26నుండి జూలై 5 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడానికి మరియు ట్రామ్ నెట్వర్క్ పనితీరును మెరుగుపరచడానికి ఖతార్ రైల్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయంతో ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతోందన్నారు.
సేవలు నిలిపివేసిన సమయంలో ప్రయాణీకులకు సేవలు నిరంతరాయంగా కొనసాగేలా లెగ్తైఫియా స్టేషన్ నుండి తర్ఫత్ - సౌత్ స్టేషన్ వరకు ప్రత్యామ్నాయ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే, ప్రస్తుతం ఉన్న మెట్రోఎక్స్ప్రెస్ మరియు మెట్రోలింక్ సేవలు, కొత్తగా ప్రారంభించిన మెట్రోలింక్ రూట్ M154తో సహా ఈ ప్రాంతాన్ని కవర్ చేయడానికి పనిచేస్తాయని పేర్కొన్నది.
వీటితోపాటు ప్రత్యామ్నాయ బస్సు మార్గాలు, సమీప బస్ స్టాప్ స్థానాలు మరియు సేవల ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోవడానికి స్టేషన్లలో ఏర్పాటు చేసిన గైడ్ లైన్స్ మ్యాప్ లను చూడాలని, అలాగే తాజా సమాచారం కోసం మెట్రో మరియు ట్రామ్ సోషల్ మీడియా ఛానెల్లను ఫాలో కావాలని మరియు కాల్ సెంటర్ 105ను సంప్రదించాలని వినియోగదారులకు ఖతార్ రైల్ సూచించింది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!







