తమిళనాడు గవర్నర్గా శంకరమూర్తి..!
- August 12, 2016
తమిళనాడు గవర్నర్గా బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక శాసన మండలి చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి నియమితులయ్యే అవకాశం ఉంది. శంకరమూర్తి నామినేషన్ను కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఫారసు చేయడంతో దానిని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ప్రస్తుత గవర్నర్ రోశయ్య పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో గవర్నర్ నియామకం మరో మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన రాజకీయవేత్త అయిన శంకరమూర్తి 1988లో సౌత్ వెస్ట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. అనంతరం 1994, 2000, 2006లో వరుసగా మూడుసార్లు ఆయన కౌన్సిల్కు ఎన్నకయ్యారు. బీజేపీలో చురుకైన నాయకుడుగా పేరున్న ఆయన 'బంగ్లా సత్యాగ్రహ'లో పాల్గొని తీహార్ జైలుకు వెళ్లారు. 1975 ఎమర్జెన్సీలో 'మిసా' కింద అరెస్టై బెల్గవాయ్ జైలులో 19 నెలల పాటు జైలుజీవితం గడిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







