ప్రత్యేక స్టాంపును విడుదల చేయనున్న ఐక్యరాజ్యసమితి
- August 12, 2016
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి గౌరవార్థం ఆమె శతజయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక స్టాంపును విడుదల చేయనుంది. ఐరాస ప్రధాన కార్యలయంలో వచ్చేవారం భారత స్వాంతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. వీటితో పాటు సుబ్బులక్ష్మి శతజయంతి ఉత్సవాలను కూడా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి స్మారక స్టాంపులను విడుదల చేయనున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి బృందం తెలిపింది.ఆగస్టు 15న భారత 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరాసలో వేడుకలు నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ ఈ వేడుకల్లో సంగీత కచేరీ చేయనున్నారు. ఐరాస హాల్లో సంగీత ప్రదర్శన ఇస్తున్న రెండో భారతీయుడు రెహమాన్. ఇక్కడ ప్రదర్శన ఇచ్చిన తొలి భారత కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి అన్న సంగతి తెలిసిందే.ఐరాసలో కచేరీ నిర్వహించేందుకు 1966 అక్టోబర్లో అప్పటి యూఎన్ జనరల్ సెక్రటరీ యు థాంట్.. సుబ్బులక్ష్మిని ఆహ్వానించారు. ఈ ఏడాదితో సుబ్బులక్ష్మి ప్రదర్శనకు 50ఏళ్లు పూర్తవనున్నాయి. కాగా.. ఇదే సంవత్సరం ఆమె శతజయంతి సంవత్సరం కూడా అయిన నేపథ్యంలో ఐరాసలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది భారత బృందం. ఆగస్టు 15 నుంచి 19 వరకు ఆమె అరుదైన చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసింది. 1916 సెప్టెంబర్ 16న సుబ్బులక్ష్మి జన్మించారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









