ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- July 04, 2026
మనామాః బహ్రెయిన్ లో ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష విధించారు. నకిలీ ట్రాఫిక్ ఉల్లంఘన మెసేజుల ద్వారా బాధితులకు 1,800 బహ్రెయిన్ దినార్లకు పైగా నష్టాన్ని కలిగించిన ఆన్లైన్ ఫ్రాడ్ పథకంలో దోషులుగా తేలిన ముగ్గురు ఆసియా జాతీయులకు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను అప్పీల్ కోర్టు సమర్థించింది. కోర్టు ప్రతి నిందితుడిపై 3,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా, రెండవ మరియు మూడవ నిందితులపై అదనపు జరిమానాలు, మరియు శిక్షాకాలం పూర్తయ్యాక వారిని శాశ్వత బహిష్కరించాలని కోర్టు తీర్పును వెలువరించింది.
నిందితులు సిమ్ కార్డులను ఉపయోగించి, బాధితులను నకిలీ చెల్లింపు లింక్లకు మళ్లించే మోసపూరిత సందేశాలను పంపి, వారి బ్యాంకు ఖాతాల నుండి అనధికారికంగా డబ్బు విత్డ్రా చేసేలా చేశారని దర్యాప్తులో వెల్లడైంది. దొంగిలించిన నిధులను బహ్రెయిన్లో మొబైల్ ఫోన్లు కొనడానికి ఉపయోగించారు. ఈ కేసులో ఒక వ్యవస్థీకృత సైబర్ మోసాల నెట్వర్క్ ప్రమేయం ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







