ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- July 04, 2026
మనామాః బహ్రెయిన్ లో ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష విధించారు. నకిలీ ట్రాఫిక్ ఉల్లంఘన మెసేజుల ద్వారా బాధితులకు 1,800 బహ్రెయిన్ దినార్లకు పైగా నష్టాన్ని కలిగించిన ఆన్లైన్ ఫ్రాడ్ పథకంలో దోషులుగా తేలిన ముగ్గురు ఆసియా జాతీయులకు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను అప్పీల్ కోర్టు సమర్థించింది. కోర్టు ప్రతి నిందితుడిపై 3,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా, రెండవ మరియు మూడవ నిందితులపై అదనపు జరిమానాలు, మరియు శిక్షాకాలం పూర్తయ్యాక వారిని శాశ్వత బహిష్కరించాలని కోర్టు తీర్పును వెలువరించింది.
నిందితులు సిమ్ కార్డులను ఉపయోగించి, బాధితులను నకిలీ చెల్లింపు లింక్లకు మళ్లించే మోసపూరిత సందేశాలను పంపి, వారి బ్యాంకు ఖాతాల నుండి అనధికారికంగా డబ్బు విత్డ్రా చేసేలా చేశారని దర్యాప్తులో వెల్లడైంది. దొంగిలించిన నిధులను బహ్రెయిన్లో మొబైల్ ఫోన్లు కొనడానికి ఉపయోగించారు. ఈ కేసులో ఒక వ్యవస్థీకృత సైబర్ మోసాల నెట్వర్క్ ప్రమేయం ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







