క్రీడలమంత్రి విజయ్గోయల్ని హెచ్చరించిన ఒలింపిక్స్ నిర్వాహకులు
- August 12, 2016
క్రీడాకారులను ప్రొత్సహించేందుకు రియోకు వెళ్లిన కేంద్ర క్రీడలమంత్రి విజయ్గోయల్ని ఒలింపిక్స్ నిర్వాహకులు హెచ్చరించారు. ఇంకోసారి అలాంటి పరిస్థితి వస్తే మంత్రి అక్రిడేషన్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంతకీ మంత్రి ఏం చేశారు. విషయం ఏంటంటే.. అక్రిడేషన్ లేని వ్యక్తులను అనుమతి లేని వేదికల వద్దకు మంత్రి తనతో తీసుకొని వెళ్లడమే నిర్వాహకులు ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పారు. ఈక్రమంలో ఆయన పక్కనున్న వ్యక్తులు ఒలింపిక్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని కాంటినెంటల్ మేనేజర్ సారా పీటర్సన్.. ఇండియన్ అధికారులకు వివరించారు. ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించామని, జిమ్నాస్టిక్ వేదిక వద్ద కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారట.
ఈ యవ్వారంపై ఇండియా అధికారి రాకేష్గుప్తా స్పందించారు. భారత్- జపాన్ మ్యాచ్ సందర్భంగా వేదిక వద్ద క్రీడాకారులను కలిసేందుకు మంత్రి ప్రయత్నించారు. కానీ అక్కడకు వెళ్లాలంటే స్పెషల్గా పాస్ కావాలని తెలుసుకొని ప్లేయర్స్ని బయట కలుసుకున్నారని వివరణ ఇచ్చారు. ఈ యవ్వారంపై మంత్రి గోయల్ కూడా స్పందించారు. తాను క్రీడా వేదిక వద్దకు వెళ్లలేదని, వాలంటీర్లు తనను అక్కడకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







