బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- July 08, 2026
రియాద్: బహ్రెయిన్ , కువైట్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) ప్రధాన కార్యదర్శి జాసెమ్ మొహమ్మద్ అల్బుదైవీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత, సంక్షోభ పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలను బలహీనపరిచే ఇరాన్ వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అల్బుదైవీ మాట్లాడుతూ, బహ్రెయిన్, కువైట్లపై జరిగిన ఈ దాడులు రెండు దేశాల సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడిగా, అంతర్జాతీయ చట్టాలు మరియు ఐక్యరాజ్యసమితి (యూఎన్) చార్టర్కు విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. అలాగే ఈ దాడులు ఆ దేశాల భద్రత, స్థిరత్వంతో పాటు అక్కడ నివసిస్తున్న పౌరులు, ప్రవాసుల ప్రాణ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా నిలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బహ్రెయిన్, కువైట్ దేశాలకు జీసీసీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు అల్బుదైవీ తెలిపారు. తమ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు, పౌరులు మరియు నివాసితుల రక్షణ కోసం ఆ రెండు దేశాలు తీసుకునే అన్ని చర్యలకు గల్ఫ్ సహకార మండలి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







