ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- July 08, 2026
షార్జా నుంచి కరాచీ కి బయలుదేరిన ఒక పాకిస్థాన్ కార్గో విమానం ఐదుగురు సిబ్బందితో సహా అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది.నిన్న రాత్రి అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా ఈ బోయింగ్ 737 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయింది. నావిగేషన్ వ్యవస్థ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పాకిస్థాన్ అధికారులు వెంటనే వివిధ ఏజెన్సీలతో కలిసి సముద్రంలో భారీ గాలింపు చర్యలు చేపట్టారు.
పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం..కే2 ఎయిర్వేస్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ విమానం పాక్ కాలమానం ప్రకారం రాత్రి 9:18 గంటలకు నావిగేషన్ సమస్య గురించి కరాచీ ఏటీసీకి తెలిపింది. ఏటీసీ అధికారులు విమానానికి మార్గనిర్దేశం చేసే ప్రయత్నంలో ఉండగానే, కేవలం మూడు నిమిషాల తర్వాత విమానం వేగంగా కిందకు పడిపోతున్నట్లు రాడార్లో నమోదైంది. కరాచీకి పశ్చిమంగా 287 కిలోమీటర్ల దూరంలో బలూచిస్థాన్లోని ఓర్మారా తీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.
ప్రముఖ విమానయాన ట్రాకింగ్ సంస్థ ‘ఫ్లైట్రాడార్ 24’ విశ్లేషణ ప్రకారం.. విమానం గాల్లో పలుమార్లు ఎత్తును కోల్పోయి, మళ్లీ పైకి లేచి, ఆ తర్వాత ఒక్కసారిగా సముద్రం వైపు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. సంబంధాలు తెగిపోయే ముందు విమానం కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉందని, నిమిషానికి 22,400 అడుగుల అసాధారణ నిలువు వేగంతో కిందకు పడిపోయిందని డేటా సూచిస్తోంది. ఈ వేగం విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయిందనే వాదనకు బలం చేకూరుస్తోంది.
అదృశ్యమైన ఈ విమానం 27 ఏళ్ల నాటి బోయింగ్ 737-400. కే2 ఎయిర్వేస్ సంస్థ నిర్వహిస్తున్న ఏకైక విమానం కూడా ఇదే. ఈ విమానాన్ని 2024లో సేవల్లోకి తీసుకువచ్చారు. ఇది మొదట 1999లో ప్యాసింజర్ విమానంగా సేవలు అందించి, 2012లో కార్గో విమానంగా మార్పు చెందింది. ప్రస్తుతం విమాన శకలాల కోసం, సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







