25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- July 11, 2026
కేరళ నుంచి జగిత్యాలకు చేరుకున్న మహ్మద్ ఇస్మాయిల్ నిజాయితీకి ప్రశంసలు
జగిత్యాల: పాతికేళ్ల క్రితం తీసుకున్న రూ.25 వేల అప్పును తిరిగి చెల్లించేందుకు కేరళ నుంచి వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి జగిత్యాల జిల్లాకు చేరుకున్న ఓ వ్యక్తి నిజాయితీ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఘటన సమాజంలో ఇంకా మానవత్వం, స్నేహానికి ఉన్న విలువను మరోసారి చాటింది.
కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో పనిచేస్తున్న సమయంలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న వద్ద రూ.25 వేల అప్పు తీసుకున్నాడు. అనంతరం ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోవడంతో సంబంధాలు తెగిపోయాయి.
అయితే, ఎన్నేళ్లు గడిచినా అప్పు తీర్చాలనే సంకల్పాన్ని వదల్లేదు. ఇటీవల లచ్చన్నను వెతికేందుకు కేరళ నుంచి తెలంగాణకు వచ్చిన ఇస్మాయిల్కు లచ్చన్న చిరునామా, ఫోన్ నంబర్ ఏవీ అందుబాటులో లేకపోయినా, గూగుల్ మ్యాప్స్ మరియు స్థానికుల సహాయంతో ధర్మపురిలోని ఆయన ఇంటిని గుర్తించాడు.
ప్రస్తుతం లచ్చన్న గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుసుకున్న ఇస్మాయిల్, ఆయనతో ఫోన్లో మాట్లాడి తన వద్ద ఉన్న రూ.25 వేల నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న లచ్చన్న, 25 ఏళ్ల తర్వాత కూడా తన అప్పు తీర్చేందుకు ఇంత దూరం ప్రయాణించి వచ్చిన స్నేహితుడు మహ్మద్ ఇస్మాయిల్ నిజాయితీని అభినందించారు. డబ్బు కంటే స్నేహం, విశ్వాసానికి ఆయన ఇచ్చిన విలువ ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
ఈ అరుదైన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. కాలం మారినా నిజాయితీ, మానవత్వం, స్నేహబంధాలకు విలువ తగ్గలేదని ఈ సంఘటన మరోసారి నిరూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







