మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- July 14, 2026
మస్కట్: మిడిలీస్టులో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేయడంతో పాటు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 2026 డెలివరీకి ఒమాన్ ముడి చమురు అధికారిక ధర సోమవారం బ్యారెల్కు 72.11 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. గత శుక్రవారం నమోదైన 69.29 డాలర్లతో పోలిస్తే 2.82 డాలర్లు పెరిగింది. గత నెల కుదిరిన తాత్కాలిక అమెరికా–ఇరాన్ ఒప్పందం భవిష్యత్తుపై తాజా పరిణామాలు అనిశ్చితిని పెంచుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బంగారం ధరలు పతనం మరోవైపు, ఆసియా మార్కెట్లలో సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో బంగారం ధరలు ఒక శాతానికి పైగా తగ్గాయి. హోర్ముజ్ జలసంధి మూసివేతపై ఆందోళనలతో చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరిగింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 4,072.78 డాలర్లకు పడిపోగా, ఆగస్టు డెలివరీకి అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 4,081.70 డాలర్లకు తగ్గాయి. అదేవిధంగా స్పాట్ సిల్వర్ ధర ఔన్స్కు 58.89 డాలర్లకు, ప్లాటినం 1,610.22 డాలర్లకు, పల్లాడియం 1,260.15 డాలర్లకు తగ్గాయి. ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కాంగ్రెస్లో ఇవ్వనున్న అర్ధవార్షిక నివేదికతో పాటు, వినియోగదారుల ధరల సూచీ (CPI), ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI), జూన్ రిటైల్ అమ్మకాల గణాంకాలపై అంతర్జాతీయ మార్కెట్లు దృష్టి సారించాయి
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







