ట్విట్టర్ లో మరో మైలురాయి చేరుకున్న మోడీ

- August 13, 2016 , by Maagulf
ట్విట్టర్ లో మరో మైలురాయి చేరుకున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ట్విట్టర్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. భారతీయ రాజకీయరంగంలో ఏ నాయకుడికి లేని ఫాలోయింగ్ ఆయనకుందని చెప్పుకోవచ్చు. సోషల్ నెట్‌వర్కింగ్ రాజకీయం కూడా మోడీ ద్వారానే అమల్లోకి వచ్చిందనే వాళ్లూ ఉన్నారు. తాజాగా ట్విట్టర్‌లో మరో కొత్త సంచలనాన్ని మోదీ సృష్టించారు. ట్విట్టర్‌లో మోస్ట్ ఫాలోయింగ్ ఇండియన్‌గా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రికార్డును ఆయన దాటేశారు. బిగ్ బీ కంటే 16 వేల మంది ఫాలోయిర్స్ అధికంగా ఉండటం ద్వారా మోదీ నెంబర్ వన్ ప్లేస్‌లోకి వచ్చిచేరారు. గత జనవరిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌ ట్విట్టర్ ఫాలోయింగ్‌ను మోదీ అధిగమించి రెండో స్థానంలోకి వచ్చారు. ఈవారం ఆయన ఫాలోయిర్స్ సంఖ్య 2 కోట్ల 18 లక్షల 65 వేల 371 ఉంది. బచ్చన్ స్కోర్ 2 కోట్ల 18 లక్షల 48 వేల 572గా ఉంది. 2 కోట్లకు పైగా ఫాలోయిర్స్‌తో షారూక్ మూడో ప్లేస్‌లోకి వచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com