ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- July 17, 2026
దోహా: ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనడానికి ఖతార్ అంగీకరించిందంటూ ఇజ్రాయెల్కు చెందిన కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలను ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుత ఘర్షణలో ఖతార్ను బలవంతంగా భాగస్వామిగా చూపించడం, మధ్యవర్తిత్వంలో దేశం పోషిస్తున్న కీలక పాత్రను దెబ్బతీయడం, ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు, అశాంతి సృష్టించడమే ఈ తప్పుడు ప్రచారాల ఉద్దేశమని పేర్కొంది.
తమ పొరుగు దేశాలపై ఎలాంటి సైనిక చర్యలోనూ ఖతార్ పాల్గొనలేదని, భవిష్యత్తులో కూడా పాల్గొనబోదని ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణలు తమ దౌత్యపరమైన శాంతి ప్రయత్నాలను ప్రభావితం చేయలేవని ఖతార్ తెలిపింది. ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి అన్ని పక్షాల ఆందోళనలకు పరిష్కారం చూపే సమగ్ర, శాశ్వత ఒప్పందం కుదిరే వరకు మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కొనసాగిస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







