ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- July 17, 2026
దోహా: ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనడానికి ఖతార్ అంగీకరించిందంటూ ఇజ్రాయెల్కు చెందిన కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలను ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుత ఘర్షణలో ఖతార్ను బలవంతంగా భాగస్వామిగా చూపించడం, మధ్యవర్తిత్వంలో దేశం పోషిస్తున్న కీలక పాత్రను దెబ్బతీయడం, ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు, అశాంతి సృష్టించడమే ఈ తప్పుడు ప్రచారాల ఉద్దేశమని పేర్కొంది.
తమ పొరుగు దేశాలపై ఎలాంటి సైనిక చర్యలోనూ ఖతార్ పాల్గొనలేదని, భవిష్యత్తులో కూడా పాల్గొనబోదని ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణలు తమ దౌత్యపరమైన శాంతి ప్రయత్నాలను ప్రభావితం చేయలేవని ఖతార్ తెలిపింది. ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి అన్ని పక్షాల ఆందోళనలకు పరిష్కారం చూపే సమగ్ర, శాశ్వత ఒప్పందం కుదిరే వరకు మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కొనసాగిస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







