అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- July 17, 2026
నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 423 సాధించిన మాస్టర్ జవ్వాజి శివ నిశాంత్కు అభినందనలు
విజయవాడ: వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక నీట్–2026 పరీక్షలో విజయవాడ కు చెందిన మాస్టర్ జవ్వాజి శివ నిశాంత్ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ర్యాంక్ 423 సాధించి విశిష్ట ప్రతిభను కనబరిచారు.
ఈ అపూర్వ విజయంతో ఆయన తన కుటుంబానికి, గురువులకు, అలాగే రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. క్రమశిక్షణతో కూడిన కృషి, లక్ష్యసాధనపై అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి అని తెలిపారు. తండ్రి డా. జవ్వాజి సతీష్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ప్రస్తుతం ఆయన సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ లో గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలు, తల్లి డా. సజ్జ హేమంత లక్ష్మి పీడియాట్రిషియన్ గా సేవలు అందిస్తున్నారు
ఈ సందర్భంగా మాస్టర్ జవ్వాజి శివ నిశాంత్కు పలువురు వైద్యులు, విద్యావేత్తలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







