230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- July 17, 2026
దుబాయ్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ గంటకు 230 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపిన ఓ డ్రైవర్ను దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అతడు ఉద్దేశపూర్వకంగా వాహనం నంబర్ ప్లేట్లను తొలగించి రోడ్లపై ప్రయాణించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే దుబాయ్ పోలీసుల సాంకేతిక నిఘా వ్యవస్థల సహాయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వాహనాన్ని స్వాధీనం (ఇంపౌండ్) చేసుకుని 50,000 దిర్హామ్ల జరిమానా విధించారు.
ట్రాఫిక్ భద్రతకు ముప్పు కలిగించే విధంగా అతివేగంగా వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లను తొలగించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. రహదారులపై ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







