230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- July 17, 2026
దుబాయ్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ గంటకు 230 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపిన ఓ డ్రైవర్ను దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అతడు ఉద్దేశపూర్వకంగా వాహనం నంబర్ ప్లేట్లను తొలగించి రోడ్లపై ప్రయాణించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే దుబాయ్ పోలీసుల సాంకేతిక నిఘా వ్యవస్థల సహాయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వాహనాన్ని స్వాధీనం (ఇంపౌండ్) చేసుకుని 50,000 దిర్హామ్ల జరిమానా విధించారు.
ట్రాఫిక్ భద్రతకు ముప్పు కలిగించే విధంగా అతివేగంగా వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లను తొలగించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. రహదారులపై ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!
- జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ







