ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- July 17, 2026
మనామా: బహ్రెయిన్పై ఇరాన్ శుక్రవారం జరిపిన పలువురు క్షిపణి, డ్రోన్ వైమానిక దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేశాయని బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (BDF) జనరల్ కమాండ్ ప్రకటించింది.
బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) ద్వారా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, ఇరాన్ రాజ్యంలోని పౌరులను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తోందని పేర్కొంది. ఈ చర్యలు ప్రాంతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది.
పౌరులు, ప్రైవేట్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను ఉద్దేశపూర్వకంగా వినియోగించడం అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన అని బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ స్పష్టం చేసింది.
దేశ భద్రతను కాపాడేందుకు బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు పూర్తిస్థాయి అప్రమత్తతతో పనిచేస్తున్నాయని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగిస్తున్నట్లు జనరల్ కమాండ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







