బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- July 24, 2026
మనామా: బహ్రెయిన్లో శుక్రవారం ఉదయం అత్యవసర సైరన్లు మోగించడంతో అప్రమత్తత నెలకొంది. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) సైరన్లను సక్రియం చేసి, పౌరులు మరియు నివాసితులు వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఎక్స్ (X) వేదికగా విడుదల చేసిన ప్రకటనలో, "సైరన్ మోగించబడింది. పౌరులు, నివాసితులు ప్రశాంతంగా ఉండి, సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి" అని పేర్కొంది.
అలాగే ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అధికారిక వర్గాలు విడుదల చేసే తాజా సమాచారం, సూచనలను మాత్రమే అనుసరించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం సైరన్లు మోగించడానికి గల కారణంపై అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించలేదు. అయితే పరిస్థితిని సంబంధిత భద్రతా సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







