ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- July 25, 2026
దోహా: ప్రపంచంలోనే అతిపెద్ద మార్షల్ ఆర్ట్స్ సంస్థ ONE ఛాంపియన్షిప్ మరియు విజిట్ ఖతార్ తమ భాగస్వామ్యాన్ని మరో మూడు సంవత్సరాలకు పొడిగించాయి. ఈ ఒప్పందం ప్రకారం 2027 నుంచి ఖతార్లో వరుసగా అంతర్జాతీయ స్థాయి ONE ఛాంపియన్షిప్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో నిర్వహించే పోటీల్లో MMA, మువాయ్ థాయ్, కిక్బాక్సింగ్, సబ్మిషన్ గ్రాప్లింగ్ విభాగాల్లో ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్టార్ క్రీడాకారులతో పాటు మధ్యప్రాచ్యానికి చెందిన ప్రతిభావంతులైన ఫైటర్లకు కూడా అవకాశం కల్పించనున్నారు.
ఈ ఈవెంట్ల ద్వారా విదేశీ పర్యాటకుల రాక పెరగడంతో పాటు ఖతార్కు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కింద తొలి ఈవెంట్ 2027 మార్చి 26న దోహాలోని అస్పైర్ డోమ్ లో జరగనుంది. టికెట్ల విక్రయం, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ONE ఛాంపియన్షిప్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ అధ్యక్షుడు హువా ఫంగ్ టెహ్ మాట్లాడుతూ.. ఖతార్తో భాగస్వామ్యాన్ని కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!







