అనంతపురం జిల్లాపై వరాల జల్లు ...
- August 15, 2016
ఎన్టీఆర్కు అత్యంత ఇష్టమైన జిల్లా అనంతపురమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 70వ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా అనంతపురంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో అనంతపురాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఆశయం పేరుతో రూ.6,554 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. తమ పార్టీకి అండగా ఉన్న జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
ప్యాకేజీ నిధుల కేటాయింపు ఇలా.. * కరవు నివారణకు రూ.1,767 కోట్లు * తాగునీటికి రూ.500 కోట్లు * పరిశ్రమలకు రూ.100కోట్లు * రహదారుల అభివృద్ధికి రూ.139కోట్లు * స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద రూ.94కోట్లు * వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2,654కోట్లు * పేరూరు ప్రాజెక్ట్ ఫేజ్-1కు రూ.850కోట్లు * బైరవానితిప్ప ప్రాజెక్టు ఫేజ్-1 కింద రూ.450కోట్లు * 2లక్షల బోర్ల రీఛార్జికి రూ.400కోట్లు * మరో లక్ష పంటకుంటల ఏర్పాటుకు రూ.850కోట్లు * 400 చెరువుల ఆధునికీరణకు రూ.450కోట్లు * పెన్నా-కుముదవతి ప్రాజెక్టుకు రూ.17కోట్లు * ఎగువ పెన్నా ఆధునికీరణకు రూ.20కోట్లు * పంట మార్పిడి పథకానికి రూ.25కోట్లు * సూక్ష్మ పోషకాల సరఫరాకు రూ.45కోట్లు * వ్యవసాయం యాంత్రీకరణకు రూ.45కోట్లు * పశుగణాభివృద్ధికి రూ.776కోట్లు * ఉద్యాన పంటల అభివృద్ధికి రూ.1,428కోట్లు * మల్చింగ్ కోసం రూ.36కోట్లు * పనిముట్ల మరమ్మతులకు రూ.10 కోట్లు * పట్టు పరిశ్రమకు రూ.71కోట్లు
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









