కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- August 05, 2026
కువైట్ : కువైట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) హవల్లీ ప్రాంతంలో నకిలీ ప్రభుత్వ స్టాంపులు తయారు చేస్తున్న ముఠాను ఛేదించింది. ఈ కేసులో ఇద్దరు ఆసియా ప్రవాసులను అరెస్టు చేసింది. దాడుల సందర్భంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న నకిలీ ప్రభుత్వ స్టాంపులతో పాటు వాటి తయారీలో ఉపయోగించిన ప్రింటింగ్ యంత్రాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగి పత్రాలపై నకిలీ స్టాంపు ఉపయోగించిన ఆరోపణలతో ఓ క్లీనింగ్ సిబ్బంది సభ్యుడిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం చేపట్టిన దర్యాప్తులో నకిలీ స్టాంపులను అసలు విలువలో సగం ధరకే క్లీనింగ్ సిబ్బందికి విక్రయించి, వాటిని అధికారిక పత్రాలపై వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టైన ఇద్దరు నిందితులు తామే నకిలీ స్టాంపులను తయారు చేసి పలువురు కార్మికులకు విక్రయించినట్లు విచారణలో అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో భాగమైన ఇతర వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించనుండగా, నకిలీ స్టాంపుల పంపిణీ లేదా వినియోగంలో ప్రమేయం ఉన్న ప్రవాస కార్మికులపై దేశ బహిష్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







