ఇరాన్–అమెరికా మధ్య చర్చలు లేవు: విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- August 09, 2026
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య ప్రస్తుతం ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి మాత్రం మధ్యవర్తుల ద్వారా కొనసాగుతోందని ఆయన తెలిపారు.
అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలపై స్పందించిన అరాఘ్చీ..మధ్యవర్తుల ద్వారా సందేశాలను పంపుకోవడం, వాటికి సమాధానాలు ఇవ్వడం చర్చలు లేదా చర్చల ప్రక్రియగా పరిగణించలేమని పేర్కొన్నారు.
ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరపాలనే ఉద్దేశంతో లేదని కూడా ఆయన వెల్లడించినట్లు రాయిటర్స్ తెలిపింది.
అయితే, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య మార్గాల ద్వారా సందేశాల మార్పిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్–అమెరికా మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో అరాఘ్చీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..
- బోనమెత్తిన హైదరాబాద్
- వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- సైబరాబాద్లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 311 మంది పై కేసులు
- ఇరాన్–అమెరికా మధ్య చర్చలు లేవు: విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- భారత చేనేత వారసత్వానికి అంకితంగా ‘జాతీయ చేనేత సమ్మేళనం–2026’
- 4వ బెటాలియన్ను సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్







