వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- August 09, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులకు రవాణా శాఖ త్వరలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ సేవలు అందించనుంది. ఇప్పటి వరకు రవాణా శాఖలో లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు మరియు ఫైనాన్స్ తొలగింపు వంటి పనుల కోసం వాహనదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను తొలగించడానికి ఏపీ ప్రభుత్వం రవాణా శాఖ సేవలను నూటికి నూరు శాతం ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఈ సేవలు అన్నీ పూర్తిగా ఆటోమేటిక్ విధానంలో అందుబాటులోకి రానున్నాయి.
ఫైనాన్స్ తొలగింపు మరియు అడ్రస్ మార్పు సులభం
వాహనదారులు తమ వాహనాలపై లోన్ తీసుకున్నప్పుడు లేదా ఈఎంఐ పూర్తి అయిన తర్వాత ఫైనాన్స్ తొలగించుకోవడానికి చాలా కాలం పట్టేది. ఇకపై వాహనాలకు ఫైనాన్స్ తొలగింపు ప్రక్రియ ఆటోమేటిక్ గా ఆన్లైన్ ద్వారా క్షణాల్లో పూర్తవుతుంది. అలాగే వాహనదారులు తమ నివాస చిరునామా మార్చుకోవాలన్నా సులభంగా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందవచ్చు. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఇతర రాష్ట్రాల వాహనాల రీరిజిస్ట్రేషన్ సులువు
ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన వాహనాలకు ఏపీలో రీరిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇప్పటివరకు ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఇకమీదట కొనుగోలు చేసిన రాష్ట్రం నుంచి సరైన ఎన్వోసీ సమర్పిస్తే ఎలాంటి తనిఖీలు లేకుండా తక్షణమే రీరిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నారు. అలాగే వాహనాల రిజిస్ట్రేషన్ చేసే డీలర్లపై ఏడాదికోసారి ఉండే తనిఖీల సమయాన్ని ఐదేళ్లకు పొడిగించారు. ఈ మార్పులన్నీ వచ్చే మూడు నెలల్లో అమల్లోకి రానున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..
- బోనమెత్తిన హైదరాబాద్
- వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- సైబరాబాద్లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 311 మంది పై కేసులు
- ఇరాన్–అమెరికా మధ్య చర్చలు లేవు: విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- భారత చేనేత వారసత్వానికి అంకితంగా ‘జాతీయ చేనేత సమ్మేళనం–2026’
- 4వ బెటాలియన్ను సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్







