లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- August 15, 2026
మస్కట్: సోషల్ మీడియాలో లైవ్ ప్రసారం ద్వారా ప్రజా నైతిక విలువలకు విరుద్ధమైన కంటెంట్ను ప్రచురించిన కేసులో ఓ అరబ్ మహిళకు ఒమన్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన అనంతరం ఆమెను దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది.
సీబ్ విలాయత్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. సమాచార నెట్వర్క్, సమాచార సాంకేతిక సాధనాలను ఉపయోగించి ప్రజా నైతిక విలువలకు విరుద్ధమైన కంటెంట్ను రూపొందించి ప్రచురించిన నేరానికి మహిళను దోషిగా తేల్చింది. శిక్షలో భాగంగా నేరానికి ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, సంబంధిత సోషల్ మీడియా ఖాతాలను మూసివేయాలని, తీర్పును ప్రచురించాలని కోర్టు ఆదేశించింది.
ప్రాసిక్యూషన్ దర్యాప్తులో.. నిందితురాలు సోషల్ మీడియాలో నిర్వహించిన లైవ్ ప్రసారంలో ప్రజా నైతిక విలువలకు విరుద్ధమైన కంటెంట్, ప్రవర్తన ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుని సంబంధిత కోర్టులో హాజరుపరిచారు.
సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఒమన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలకు సూచించింది. ప్రజా క్రమం లేదా నైతిక విలువలకు విరుద్ధమైన కంటెంట్ను ప్రచురించడం, షేర్ చేయడం లేదా ప్రసారం చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరింది. ఒమన్ సమాజ విలువలు, సంప్రదాయ నైతిక ప్రమాణాలను పరిరక్షించడంలో పౌరులు, నివాసితులు చూపుతున్న అవగాహనను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభినందించింది.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







