అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- August 15, 2026
దోహా: దోహాలోని అల్ సాద్ మెట్రో స్టేషన్ కళా ప్రదర్శనకు వేదికగా మారింది. ఖతార్ మ్యూజియమ్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆకట్టుకునే కళా చిత్రాలు (మ్యూరల్స్) ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఖతార్ రైల్ ఇటీవల సోషల్ మీడియా పోస్టులో ఈ కళాకృతుల గురించి ప్రస్తావించింది. ప్రయాణికుల రోజువారీ మెట్రో ప్రయాణంలో కళ, సంస్కృతిని పరిచయం చేసేలా వీటిని రూపొందించినట్లు తెలిపింది. రంగురంగుల మ్యూరల్స్తో స్టేషన్ పరిసరాలు ఓపెన్-ఎయిర్ ఆర్ట్ గ్యాలరీని తలపిస్తున్నాయి.
ఖతార్ మ్యూజియమ్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా కళా కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో స్థానిక వారసత్వం, ఆధునిక కళాత్మకత కలగలిసిన అంశాలు కనిపిస్తాయి. ఒక ప్రముఖ చిత్రంలో సంప్రదాయ ఖతారీ దుస్తుల్లో ఉన్న వ్యక్తితో పాటు ఒంటె, గద్దను అరేబియన్ సంప్రదాయ ఆకృతుల మధ్య చిత్రించారు. మరో మ్యూరల్లో పెయింటింగ్ చేస్తున్నట్లు కనిపించే పాత్రలను సరదాగా చిత్రించగా, ఇంకో కళాకృతిలో థోబ్లు ధరించిన వ్యక్తులు పెద్ద గిన్నెల చుట్టూ ఉన్న దృశ్యాన్ని ఆధునిక శైలిలో ఆవిష్కరించారు.
దోహాలోని ప్రజా రవాణా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో కళను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గోల్డ్ లైన్లో ఉన్న అల్ సాద్ మెట్రో స్టేషన్ 2019 నవంబర్లో ప్రారంభమైంది. రద్దీగా ఉండే అల్ సాద్ ప్రాంతంలో కీలక ప్రదేశంలో ఉన్న ఈ స్టేషన్లోని కళాకృతులను స్థానికులు, సందర్శకులు సులభంగా వీక్షించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







