డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల ఉల్లంఘనపై సౌదీ కఠిన చర్యలు..!!
- August 18, 2026
రియాద్: డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల ఉల్లంఘనపై సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. వికలాంగుల సంరక్షణ అథారిటీ (APD) నిబంధనలు ఉల్లంఘించే ప్రభుత్వేతర సంస్థలపై తనిఖీలు, పర్యవేక్షణతో పాటు జరిమానాలు విధించే అధికారాలను నేరుగా అమలు చేయడం ప్రారంభించింది. డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల చట్టంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు APD వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు గరిష్ఠంగా SR500,000వరకు జరిమానా విధించనున్నారు. అదే తప్పును మళ్లీ చేస్తే జరిమానాను రెట్టింపు చేయనున్నారు.
డిసబుల్డ్ పర్సన్స్ చట్టం కల్పించిన హక్కులు, సేవలను నిరాకరించడం, వారి పట్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వివక్ష చూపే విధానాలను అవలంబించడం వంటి వాటిని తీవ్రమైన ఉల్లంఘనలుగా పరిగణించనున్నారు. అలాగే డిసబుల్డ్ పర్సన్స్ తమ చట్టపరమైన వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించకుండా అడ్డుకోవడం, విద్య, శిక్షణ, వైద్యం, బీమా, ఆర్థిక సేవలు, రవాణా వంటి సౌకర్యాలను నిరాకరించడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని APD స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు సహా ప్రభుత్వేతర సంస్థల్లో ఈ నిబంధనలు అమలయ్యేలా తనిఖీలు, పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తామని అథారిటీ తెలిపింది. డిసబుల్డ్ పర్సన్స్ కు ఇతరులతో సమానంగా సేవలు, అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘనంగా భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ పట్ల విధేయత ప్రతిజ్ఞ చేసిన భారతీయ ప్రవాసులు..
- డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల ఉల్లంఘనపై సౌదీ కఠిన చర్యలు..!!
- మీ పేరుపై ఉన్న ఫోన్ నంబర్లను తెలుసుకోవచ్చు.. ‘సహల్’లో కొత్త సర్వీస్..!!
- మానసిక ఆరోగ్య చికిత్సలపై కఠిన నిబంధనలు అవసరం..!!
- యూఏఈలో కొనసాగుతున్న ఎండల తీవ్రత..వర్షాలు పడే అవకాశం..!!
- ఒమన్లో ఆకట్టుకున్న ఇండియన్ సోషల్ క్లబ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ప్రయాణికులకు గుడ్న్యూస్.. ప్రతి 15 నిమిషాలకు ఉచిత షటిల్ సర్వీస్..!!
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్







