స్కూల్స్ రీ ఓపెన్.. సౌదీ ఫుడ్ అథారిటీ కీలక సూచనలు..!!
- August 20, 2026
రియాద్: సౌదీ అరేబియాలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ప్రతిరోజూ సమతుల్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించాలని సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) సూచించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు ఆగస్టు 23 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యకరమైన అల్పాహారం పిల్లలకు అవసరమైన శక్తి, పోషకాలను అందిస్తుందని SFDA తెలిపింది. ఇవి పిల్లల శారీరక ఎదుగుదల, చదువుపై ఏకాగ్రత, అభ్యాసం, శారీరక చురుకుదనంకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంది.
పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో.. రోజును పోషక విలువలతో కూడిన అల్పాహారంతో ప్రారంభించడం వల్ల పిల్లలకు అవసరమైన శక్తి లభిస్తుందని వివరించింది. అల్పాహారంలో పండ్లు, కూరగాయలు చేర్చడం ద్వారా ఆహారంలో వైవిధ్యం పెరుగుతుందని, వాటి ద్వారా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లభించి పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయని SFDA తెలిపింది.
అల్పాహారంలో పాలు లేదా పాల ఉత్పత్తులు, ధాన్యాలు, ముఖ్యంగా సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ అందించే ఆహారం, పండ్లు లేదా కూరగాయలు, పరిమిత మోతాదులో కొవ్వు ఉండేలా చూసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ.. పిల్లల చదువు, ఏకాగ్రత, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య అల్పాహారం కీలకమని SFDA స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అబుదాబి ‘ది కార్స్’ కాన్సర్ట్ రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్..!!
- స్కూల్స్ రీ ఓపెన్.. సౌదీ ఫుడ్ అథారిటీ కీలక సూచనలు..!!
- ఖతార్లో కొత్త డ్రోన్ చట్టంపై అవగాహన కార్యక్రమం..!!
- కువైట్లో ఫ్లాషింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్.. ఢీకొనే ప్రమాదాలకు చెక్..!!
- ఒమన్లో ఘనంగా రాజస్థానీ మహిళల ‘తీజ్ ఉత్సవ్’..!!
- సైరన్లను నిర్లక్ష్యం చేయొద్దు.. బయటకు రావొద్దు..!!
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా







