రాఖీ పౌర్ణమి సందడి తెలుగు రాష్ట్రాల్లో..
- August 17, 2016
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి సందడి మొదలయ్యింది. సోదరులకు రాఖీలు కట్టి ప్రేమాభిమానాల్ని చాటుకునేందుకు సోదరీమణులు సిద్ధమవుతున్నారు. అటు మార్కెట్లో 10 రూపాయల నుంచి మొదలు కొని ఐదొందల వరకు వివిధ రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. మొత్తానికి అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఈ బంధం మరింత బలోపేతమయ్యేందుకు ఈ శుభ దినం దోహదం చేస్తుంది.
అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఒకరికి ఒకరు ఉన్నాం అనే ధీమానిచ్చే బంధాలివి. జీవితాంతం భరోసానిచ్చే అనుబంధాలివి. అడుగడుగునా సంరక్షణనిచ్చే నమ్మకాలివి. అందుకే అన్నా చెల్లెళ్ల అనుబంధానికి.. అక్కా, తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.. నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. కష్టసుఖాల్లో ఒకరికొకరం సంరక్ష.. అనే అభయాన్ని తోబుట్టువులకిచ్చే పండుగే రాఖీ పౌర్ణమి.
కులమతాలకు అతీతంగా.. ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు అపురూపంగా జరుపుకునే ఉత్సవమే రాఖీ పౌర్ణమి.ఈ రోజంతా ఇంటింటా రాఖీ ఆనందోత్సాహాలు వెల్లివిరియనున్నాయి. పెళ్లయి అత్తారింటికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టేందుకు సోదరుల ఇంటికి పయనమవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాఖీ సందడి అంతా ఇంతా కాదు. అందమైన రాఖీలు కొనుగోలు చేసేందుకు మహిళలు, యువతులు, బాలికలు బుధవారం బిజిబిజీగా గడిపారు. దీంతో రాఖీ దుకాణాలు, స్టాళ్లు జనాలతో కిటకిటలాడాయి. అటు..10 నుంచి మొదలుకొని 500 రూపాయల వరకు ధరల్లో రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తికి తగ్గట్లుగానే తయారీదారులు వెరైటీ రాఖీలను తయారు చేసారు. ఈసారి మోదీ రాఖీలు అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా చిన్నారులను ఛోటా భీం రాఖీలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోదరులకు రాఖీలు కట్టాక నోరు తీపి చేయడం ఆనవాయితీ.. దీంతో స్వీట్ షాపులూ కిటకిటలాడుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









