156మంది భారతీయులను సంకట్ మోచన్ ఆపరేషన్ పేరిట సురక్షితం...
- August 17, 2016
భారత్ పై అమెరికా ప్రశంసల జల్లు కురిపించింది. సంకట్ మోచన్ పేరిట తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు భారత ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసం అద్భుతం అని అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ డెడోరా లీ జేమ్స్ అన్నారు. త్వరలో భారత్ పర్యటనకు రానున్న ఆమె సౌత్ సుడాన్ లో ఇబ్బందుల్లో పడిన భారతీయులను తమ దేశం నుంచి కొనుగోలు చేసిన భారీ యుద్ద విమానం సీ-17 గ్లోబ్ మాస్టర్ ద్వారా సురక్షితంగా తిరిగి తమ మాతృదేశంలోకి సురక్షితంగా చేర్చగలిగారని కొనియాడారు.ఈ సందర్భంగా భారత్ ను అభినందించకుండ ఉండలేకపోతున్నానని చెప్పారు. త్వరలోనే స్వయంగా తాను వెళ్లి మరోసారి భారత్ కు ఈ విషయంలో అభినందనలు చెబుతానని చెప్పారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దక్షిణ సుడాన్ లో సంకంటంలో పడిన 156మంది భారతీయులను సంకట్ మోచన్ ఆపరేషన్ పేరిట సురక్షితంగా గత నెలలో తిరిగి తీసుకొచ్చింది.భారత్ వైమానిక దళం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని, ఇరు దేశాల మధ్య గతంలో ఆగిపోయిన పలు కార్యక్రమాలు తన పర్యటనతో తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. ఇరు దేశాల సైనికులకు ఉమ్మడి శిక్షణ, కొన్ని ఆపరేషన్లలో కలిసి పనిచేయడం, ప్రమాదాలు ఎదుర్కోవడం వంటివి చేస్తామని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









