వియత్నాంలో కువైట్ పౌరులకు హెచ్చరికలు జారీ..!!

- August 22, 2026 , by Maagulf
వియత్నాంలో కువైట్ పౌరులకు హెచ్చరికలు జారీ..!!

కౌలాలంపూర్: వియత్నాంవైపు తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న కువైట్ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కువైట్ రాయబార కార్యాలయం సూచించింది. తుపాను ప్రభావం పలు ప్రాంతాలపై ఉండే అవకాశం ఉందని తెలిపింది. స్థానిక అధికారులు జారీ చేసే అన్ని భద్రతా సూచనలు, ముందస్తు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

అత్యవసర పరిస్థితి ఎదురైతే లేదా తక్షణ సహాయం అవసరమైనప్పుడు కువైట్ పౌరులు రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ +84 961 377 717ను సంప్రదించాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com