సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్లో బోర్డింగ్ పాస్పై స్టాంపింగ్ రద్దు..!!
- August 23, 2026
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే ఉద్దేశంతో భారత విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో బోర్డింగ్ పాస్పై ఫిజికల్ స్టాంపింగ్ను సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేయనున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BoI) విమానాశ్రయ అధికారులకు తెలియజేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న బోర్డింగ్ పాస్ స్టాంపింగ్ విధానం ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతోందన్న నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఎలక్ట్రానిక్, ప్రింటెడ్ బోర్డింగ్ పాస్లు రెండూ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో చెల్లుబాటు అవుతాయి. ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్లోని ఈ-బోర్డింగ్ పాస్ను చూపించి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చు. ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ ఉన్నవారికీ అదే విధానం కొనసాగుతుంది. బోర్డింగ్ పాస్పై స్టాంప్ వేయాల్సిన అవసరం లేకపోవడంతో విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..25 రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ!
- సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్లో బోర్డింగ్ పాస్పై స్టాంపింగ్ రద్దు..!!
- బహ్రెయిన్లో 17 వేల కుటుంబాలకు హౌసింగ్ ఫైనాన్స్ ప్రయోజనం..!!
- ఒమన్లో ఆస్తి సంబంధిత నేరాలే అత్యధికం..ఎన్సీఎస్ఐ నివేదిక..!!
- సౌదీలో వారం రోజుల్లో 13,724 మందిపై బహిష్కరణ వేటు..!!
- అమెరికాకు అండగా నిలిస్తే శత్రువులుగా పరిగణిస్తాం..ఇరాన్ హెచ్చరిక
- ఖతార్లో కొత్తగా ఆరు ప్రభుత్వ పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్..!!
- బహ్రెయిన్లో టీం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
- బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
- సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్కు డీజీపీ సి.వి.ఆనంద్ అభినందనలు







