ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- August 26, 2026
అమెరికా: అమెరికా-ఇరాన్ మధ్య వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇటీవల పలువురు విదేశీ మిత్రదేశాల మంత్రులతో ఫోన్ ద్వారా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన వాషింగ్టన్ ప్రస్తుత ఇరాన్ విధానాన్ని స్పష్టం చేశారు. ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతానికి ఇరాన్పై కొత్తగా సైనిక దాడులు ప్రారంభించే ఆలోచన అమెరికాకు లేదని ఆయన పేర్కొన్నారు. దానికి బదులుగా ఆర్థిక ఒత్తిడిని పెంచడం, సైనిక చర్య కాకుండా ఇతర మార్గాల ద్వారా టెహ్రాన్ను అదుపు చేయడానికే వాషింగ్టన్ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడి చేస్తాం : అమెరికా
ముఖ్యంగా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇటీవల ప్రకటించిన కఠినమైన ఆంక్షల కార్యక్రమాన్ని అమలు చేయడమే ఇప్పుడు తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. అమెరికా (America) మళ్లీ పెద్ద ఎత్తున నేరుగా పోరాట చర్యల్లోకి దిగాలని భావించడం లేదని రూబియో స్పష్టం చేసినప్పటికీ.. ఒకవేళ ఇరాన్ వైపు నుండి ఏదైనా ముందస్తు దాడి జరిగితే మాత్రం ప్రతిదాడి చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అమెరికా అధికారులు తెలిపారు. రాజకీయం, వ్యూహాత్మక పరంగా చూస్తే, ప్రస్తుతానికి సైనిక ఘర్షణలకు దూరంగా ఉండటం, నౌకా దిగ్బంధనం చేయడం, ఆర్థిక ఆంక్షలను మరింత తీవ్రతరం చేయడం ట్రంప్ పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనితో పాటు, ప్రపంచ మార్కెట్లకు ఇంధన కొరత రాకుండా హార్ముజ్ జలసంధి ద్వారా వీలైనంత ఎక్కువ చమురును రవాణా చేయడానికి అమెరికా ప్రాధాన్యత ఇస్తోంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







