సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- August 27, 2026
రియాద్: సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి, క్యాబినెట్ సభ్యుడు, వాతావరణ దూత అదెల్ అల్-జుబైర్ బుధవారం భారత, బ్రెజిల్ దేశాల రాయబారులతో సమావేశమయ్యారు. రియాద్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సౌదీ అరేబియాలో నూతనంగా నియమితులైన భారత రాయబారి విపుల్తో అల్-జుబైర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత రాయబారికి స్వాగతం పలికి, కొత్త బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
అలాగే, సౌదీ అరేబియాలో బ్రెజిల్ రాయబారి పాలో ఉచోవా రిబెయిరో ఫిల్హోతో కూడా అల్-జుబైర్ సమావేశమయ్యారు. ఇరువురు పరస్పర ఆసక్తికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. భారత్, బ్రెజిల్తో సౌదీ అరేబియా ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై ఈ భేటీలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







