ఈ నిర్లక్ష్యం కాదు క్షమార్హం
- August 19, 2016
ఆకాశాన్నంటే భవనాలు, అందులో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, దానికి తోడు కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం.. ఇవన్నీ కలిసి పసి ప్రాణాల్ని చిదిపేస్తున్నాయి. సార్జాలో ఇటీవల అపార్ట్మెంట్లపైనుంచి పడిపోయి మృతి చెందుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన రెండు నెలల్లో ఐదుగురు చిన్నారులు ఇదే విధంగా బాల్కనీల్లోంచి కిందకు పడిపోయి చనిపోయారు. బాల్కనీలు, కిటికీల నుంచి పిల్లలు పడిపోతోంటే, వారిని సంరక్షించాల్సిన కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం వహిస్తుండడం దురదీష్టకరం. భవనాల మీద నుంచి పిల్లలు కిందపడి చనిపోవడానికి ప్రధాన కారణం కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమేనని షార్జా పోలీస్ కమాండర్ - బ్రిగేడియర్ సైఫ్ అల్ షమ్సి చెప్పారు. కిటికీలు, అలాగే బాల్కనీల ఎత్తు కనీసం 120 సెంటీమీటర్లు ఉండేలా చూడాలనీ, కిటికీ ఊచల మధ్య గ్యాప్ 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంటే ప్రమాదాలు జరగవనీ, నిర్మాణదారులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయమై భవన నిర్మాణదారులు, అలాగే ల్యాండ్ లార్డ్స్తో సమావేశమై భద్రతా చర్యలు పెంచే ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







