ఫేక్ బిల్స్: నైజీరియన్ అరెస్ట్
- August 19, 2016
100 డాలర్ల విలువైన ఫేక్ బిల్స్ని సర్క్యులేట్ చేస్తున్న నేరానికిగాను నైజీరియాకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 43 ఏళ్ళ నిందితుడు విజిట్ వీసాపై వచ్చాడు. కస్టమ్స్ వద్ద 1 మిలియన్ డాలర్లు సీజ్ చేయబడ్డాయనీ, 2,600 డాలర్లు ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చని చెబుతూ ఓ మహిళను మోసం చేశాడు. పోలీసులు విచారణ జరిపి నిందితుడ్ని అరెస్టు చేసి, న్యాయస్థానానికి తరలించారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్, నిందితుడికి 5,000 దిర్హామ్ల ఫైన్ విధించింది. ఏడాది జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఫేస్ బుక్ ద్వారా ఓ మహిళతో బాధితురాలికి నిందితుడు వల వేశాడు. బాధిత మహిళ, నిందితుడికి 2,600 డాలర్లు చెల్లించినట్లు పేర్కొంది. కొన్ని పత్రాలపై సంతకాల కోసం నిందితుడు తనపై ఒత్తిడి తీసుకురాగా, తాను నిరాకరించినట్లు తెలిపిందామె. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అపీల్ చేసుకోవడానికి నిందితుడికి అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







