భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- September 04, 2026
ఫుజైరా: ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ హెచ్.హెచ్. షేక్ మహమ్మద్ బిన్ హమద్ బిన్ మహమ్మద్ అల్ షర్ఖీ భారత, క్యూబా దేశాల యూఏఈ రాయబారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఎమిరీ కోర్టులోని తన కార్యాలయంలో ఈ సమావేశాలు జరిగాయి.
భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, క్యూబా రాయబారి నోర్బెర్టో కార్లోస్ ఎస్కలోనా కారిల్లోలు ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ ఇద్దరు రాయబారులకు స్వాగతం పలికి, తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
సమావేశాల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ను కలవడం పట్ల ఇద్దరు రాయబారులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు అందించిన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రంగాల్లో ఫుజైరా ఎమిరేట్ సాధిస్తున్న గణనీయమైన అభివృద్ధిని వారు ప్రశంసించారు.
ఈ సమావేశాల్లో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ కార్యాలయ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ హమ్దాన్ అల్ జెయౌదీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







